ముందు చూపు
రాధ ,సిత ,గీత అనే మూడు చేపలు ఒక నదిలో నివసిస్తూ ఉండేవి ఒక సారి వేసవిలో చెరువులో నిరు బాగా తగ్గి పోయాయి అది గమనించిన రాధా ,సిత ,గీత లతో మనం ఈ నదిని వదిలి వేరే నీరు ఎక్కువగా ఉన్న నదిలోకి ఇప్పుడే వెళ్లి పోదాము . ఇప్పుడే ఈ నదిలో నీరు చాల తగ్గి పోఎంది ఇంకా కొన్ని రోజులు ఐతే ఇంకా నీరు తగ్గిపోతుంది అప్పుడు చేపలు పట్టే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకు పోతారు కాబట్టి మనం ఇప్పుడే ఈ నదిని వదిలి వెల్లిపోదాం అని అంది అది విన్న సిత ,గీత లు అ ఎప్పుడో కష్టం వస్తుంది అని ఇప్పుడే ఎందుకు ఆలోచించడం ,ఐన ఇప్పుడు మనం ఈ మడుగులో చాల సుఖం గా ఉన్నాము కదా , ఐన నువ్వు అన్నట్టు కష్టం వచ్చిన అప్పటికి అదో ఒక ఉపాయం తట్టక పోతుందా అని అన్నాయీ ఇది విన్న రాధా వీళ్ళు ఎలాగు రారు వీళ్ళతో ఉంటె నేను కూడా చావాల్సి వస్తుంది అని అది ఆ చెరువులోకి నీరు వచ్చే పిల్ల కాలువలోకి వెళ్లి దాని లో ఈదుకుంటూ బాగా నీరు ఉన్న వేరే జలాశయం లోకి చేరి సంతోషంగా ఉంది . కొద్ది రోజులు గడిచాయి చెరువులో నీళ్ళుఇంకా తగ్గాయి కొందరు చేపలు పట్టే వాళ్ళు అ చెరువులోకి వచ్చి వల వేసి చేపల్ని పట్టుకున్నారు అప్పుడు సిత, గీతాలకి రాధ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి తన మాట విని ఉంటె మనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని అనుకున్నాయి ,ఇప్పుడు
నీతి : అపాయాన్ని ముందుగా గుర్తించి తప్పించుకునే వాడే తెలివైన వాడు ఎవారి కైనా ముందు చూపు ఉన్నపుడే జీవితం లో ఎదురయ్యే సమస్యల నుండి తెలివిగా తప్పించుకోగలడు .
No comments:
Post a Comment