ఆసక్తి
శ్రీరామ పట్టాభిషేకం
ఐన తరువాత శ్రీరాముల
వారి కి ఆంజనేయ స్వామి వారే అన్ని సేవలు చేస్తూ సర్వదా
స్వామి వెంటే ఉంటూ ఉన్నారు
శ్రీరాముల వారి తమ్ములైన భరత,లక్ష్మణ , శతృజ్ఞులు
ఎంతగా ప్రయత్నించిన శ్రీరాముల వారికీ ఎ
సేవ కూడా చేయలేక పోతున్నారు అమీ చేద్దామన్న
ముందుగానే మారుతీ అక్కడ ఉంటున్నారు ఇలాకొంత కాలం గడిచింది ఎలా ఐన అన్నగారి సేవ చేయాలనీ బాగా అలోచించి
భరత,లక్ష్మణ , శతృజ్ఞులు. ఒక ఉపాయం అలోచించి
అన్నగారైన శ్రీ రాముల వారి దగ్గరకు వెళ్లి
అగ్రజా
! తమ సేవ చేయు భాగ్యము మా ముగ్గురికి ప్రసాదించవలసింది
అని కోరుకున్నారు
ఏది విన్న శ్రీరామ చంద్రుడు
మీరు అసేవ చేయాలనుకుంటున్నారో అ సేవను ఆనందం గా చేసుకోండి అని
చెప్పారు .
ఏది విని ముగ్గురు సంతోషంగా
అన్నగారికి చేయాలనుకుంటున్న సేవలను ఒక పట్టికగా
రాసుకుని
ఎవరెవరు అ సేవ చేస్తారో రాముల వారికి చదివి వినిపించి . రాముల వారి అనుమతిని పొందారు
ఇది విన్న ఆంజనేయ స్వామి
శ్రీ రాముల వారితో స్వామి అన్ని సేవలు వారు ముగ్గురే పంచుక్కరు కదా "మరి
నా గతి
ఏమి
? స్వామి అని
అడిగారు
ఇంతలో
భరత,లక్ష్మణ , శతృజ్ఞులు
శ్రీ రామ చంద్రుడు మా ప్రార్ధన
మన్నించారు . వారు ఆడిన మాట తప్పారు కావున మేము కోరగా మిగిలిన సేవ ఏదైనా
ఉంటె ఆంజనేయుడు చేసుకోన వచును అని
భరత,లక్ష్మణ , శతృజ్ఞులు
చెప్పారు రాముల వారితో
అప్పుడు ఆంజనేయ స్వామి బాగా అలోచించి
" సరే మీ షరతును అనుసరించే
కోరుకుంటాను
అని రాముల వారు "ఆవులించినపుడు " చిటిక వేసే
భాగ్యము నాకు
ప్రసాదించిన చాలును
అని అనగా
దానికి
భరత,లక్ష్మణ , శతృజ్ఞులు
మాకు అభ్యంతరం అమీ లేదు అని
ఆ సేవ ఆంజనేయుడు చేసుకోన వచ్చు
అని పలికిరి . ఈ విదముగా తీర్మానము
ఐనది
శ్రీ రాముడు స్నానానికై లేవగా అ సేవ
తన వంతైనా లక్ష్మణుడు బయలుదేరాడు
ఇంతలో
హనుమతుడు
నీవేక్కడికి ఈ సేవ నావంతు
అని అన్నారు ఆశ్చర్యంగా చుసుతున్న లక్ష్మణుడితో ఆంజనేయుడు అయ్యా స్నానము చేయునపుడో, దుస్తులు దరిన్చునపుడో,అలంకరించు సమయములోనో ,భోజన కాలములోనో ,శయనించు సందర్భాములోనో
ఎప్పుడుడైన
" నా స్వామికి ఆవులింత రావచును అప్పుడు తక్షణమే చిటిక వేయుటకు నేను సిద్దముగా ఉండవలెను కదా ?" అందుచే మీ సేవ మీరు చేసుకునుడు
నా సేవకు అడ్డువచ్చుట
ధర్మమా ? అని అనెను ఇది విన్న
భరత,లక్ష్మణ , శతృజ్ఞులు మారుతి యొక్క యుక్తికి , అద్వితీయ సేవాసక్తికి ,రామ భక్తికి
మేచుకున్నారు
నీతి : ఆసక్తి ఉంటె అన్ని సాధ్యమే
No comments:
Post a Comment